కా చదువు అనే విషయం మీద నాకు పూర్తి అవగాహన లేదు. " పాండిత్యం కంటే జ్ఞానం ముఖ్యం " అనే జగద్విఖ్యాత (మాయా బజార్ సినిమా లోనిది ) డైలాగ్ ని అస్తమానూ అంటుండే వాడిని. మాస్టారు మాత్రం "జ్ఞానం రావాలంటే పుస్తకాలు చదివించాలి కదా " అని అంటుండే వారు. ఆ తరువాతే కొడవటిగంటి కుటుంబ రావు గారి " చదువు " నవలిక చదివిన తరువాత నాకైతే చదువు అనే విషయం గురించి అవగాహన ఏర్పడింది కాని మాస్టారు ఈ అక్షర దీక్ష కార్యక్రమంలో ఏమి నేర్పుతున్నారో నేను తెలుసుకోలేదు. ఎందుకంటే నేను ప్రభుత్వోద్యోగం సంపాదించడం ,దాని కోసం నాగపూర్ వెళ్ళడం జరిగాయి. ఆ తరువాత అప్పుడప్పుడు రాసుకొనే లేఖలే మా యిద్దరి మద్య బంధాన్ని కొనసాగించాయి. అనుకోకుండా పందోనిమిది వందల తొంభై రెండు లో నేను సికింద్రాబాద్ ట్రాన్స్ఫర్ ఐనప్పుడు ఆయన చాలా సంతోషించారు. కనీసం మనం యిప్పుడు తరచూ కలసికోవచ్చు అని అంటుండే వారు అలా ఆనందం లో ఉండగానే ...ఈ మహాభినిష్క్రమణ జరిగి పోయింది.22, ఫిబ్రవరి 2011, మంగళవారం
యుగానికొక్క మాస్టారు
కా చదువు అనే విషయం మీద నాకు పూర్తి అవగాహన లేదు. " పాండిత్యం కంటే జ్ఞానం ముఖ్యం " అనే జగద్విఖ్యాత (మాయా బజార్ సినిమా లోనిది ) డైలాగ్ ని అస్తమానూ అంటుండే వాడిని. మాస్టారు మాత్రం "జ్ఞానం రావాలంటే పుస్తకాలు చదివించాలి కదా " అని అంటుండే వారు. ఆ తరువాతే కొడవటిగంటి కుటుంబ రావు గారి " చదువు " నవలిక చదివిన తరువాత నాకైతే చదువు అనే విషయం గురించి అవగాహన ఏర్పడింది కాని మాస్టారు ఈ అక్షర దీక్ష కార్యక్రమంలో ఏమి నేర్పుతున్నారో నేను తెలుసుకోలేదు. ఎందుకంటే నేను ప్రభుత్వోద్యోగం సంపాదించడం ,దాని కోసం నాగపూర్ వెళ్ళడం జరిగాయి. ఆ తరువాత అప్పుడప్పుడు రాసుకొనే లేఖలే మా యిద్దరి మద్య బంధాన్ని కొనసాగించాయి. అనుకోకుండా పందోనిమిది వందల తొంభై రెండు లో నేను సికింద్రాబాద్ ట్రాన్స్ఫర్ ఐనప్పుడు ఆయన చాలా సంతోషించారు. కనీసం మనం యిప్పుడు తరచూ కలసికోవచ్చు అని అంటుండే వారు అలా ఆనందం లో ఉండగానే ...ఈ మహాభినిష్క్రమణ జరిగి పోయింది.15, ఫిబ్రవరి 2011, మంగళవారం
ఎత్తరుగుల మండువా లోగిళ్ళు
వర్షాధారిత వ్యవసాయం , వరదలలో కొట్టుకు పోయే పంటలున్నంత వరకు ఆంతా శ్రమ జీవులే. బహుశా కాటన్ ఆనకట్ నిర్మాణం జరిగిన తరువాత స్త్రీలకు ఈ జిల్లాలలో మిగులు సమయం చిక్కి ఉండవచు మగవాళ్ళు నెమ్మదిగా వీళ్ళని పొలం పనుల నుండి తప్పించేయడంతో వీళ్ళది కుటంబంలో సహాయక పాత్రకే పరిమితమై పోయింది .ఆఫీసుల్లో పని చేసే వాళ్లకు ఒకప్పుడైతే అర్ధం చేసుకోడం కష్టమయ్యేదేమో గాని ఇప్పుడు అందరికీ ఒక విషయం చక్కగా అర్ధం అవుతుంది. ఎవరికైనా భాద్యతలు తగ్గించారంటే వాళ్ళ కుర్చీ క్రిందకు నీళ్ళు వస్తున్నాయనే అర్ధం. అదే విధంగా స్త్రీల హక్కులు నెమ్మదిగా ఉపసంహరించ బడటమే కాకుండా వీరికి లేని పోని కొత్త అలవాట్లు కూడా ఈ మండువా లోగిల్ల లోనే వచ్చి ఉండవచ్చని నా అభిప్రాయం . శ్రామిక శక్తి గా ఉన్నంత కాలం స్త్రీలు అబలగా ఉండరు . నెమ్మదిగా వీరి కుటంబ శ్రమను ప్రొడక్టివ్ శ్రమగా గుర్తించడం మానేశారు . స్త్రీలు కూడా ఇదే పంధాకు అలవాటు పడి పొయ్యారు . మగ వాళ్ళు పొలం వెళ్ళగానే నలుగురూ ఈ మండువా లోగిల్ల లోనికి చేరి పోసుకోలు కబుర్లకి ప్రాధాన్యమున్న పనులు మొదలు పెట్టడం అత్యంత పరిపాటి గా మారింది ఇది నెమ్మదిగా ఎక్కడికి దారి తీసిందంటే ఈ స్త్రీలు చేసే ప్రతి పని తమకు నచ్చడం కంటే పక్కవాళ్ళకు నచ్చడమే ప్రధానంగా మారింది. స్వతంత్ర వ్యక్తిత్వాలు చాలా త్వరగా కనుమరుగై పొయ్యాయి. బలమైన వ్యకిత్వం లేని వాడికి పక్క వాడో , పై వాడో చెప్పిందే వేదం. అంతే నీకు మొగుడినా చెప్పాలి ..లేదా పక్కనున్న వాళ్లైనా చెప్పాలి. ఇదంతా మొగవాళ్ళకి అత్యంత అనుకూలమైన వ్యవస్థ. ఇది అలా ..అలా ఆడంబరాలకు దారి తీసింది. అందం అనే భావనను ఆడంబరం మింగేసింది. అత్యంత హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే తన భర్తకు అందంగా కనిపించాలనే తపన పోయి ఆ స్థానం లోకి పదిమందిలో ఆడంబరంగా కనిపించాలనే తాపత్రయం మొదలైంది. శృంగార భావనలు మనసు లో నుండి కానీ ....చాలా వరకు శరీరాల్లో నుండి కానీ ఇంకిపోతున్నాయనే సత్యాన్ని గుర్తించడం మానేశారు. నేను ఇంతకు ముందు వేరొక పోస్ట్ ( వీరూ గురించి ) లో రాసి నట్లుగా తమకు చీరలు, నగలు ఇంట్లో నింపిన మగవాడే మొగాడు గా మారాడు. ఒక విధంగా ఈ స్త్రీలకూ దేవుడిగా మారాడు. ఒక విధంగా ఇదంతా సమాజాన్ని పూర్తి పురుషాధిక్యత లోనికి నెట్టేసింది . తరాలు మారిన కొద్దీ ఈ దిగజారుడు పెరిగింది. మంచి,చెడు ఒకదాని కొకటి పెనవేసుకు పొయ్యాయి. మనకు మంచి జరుగుతున్నా ఒక పని వలన సమాజానికి చెడు జరుగుతుంటే అది " చెడు" కిందే లెక్క , మనకు ఒక వేళ కొంత నష్టం కలిగినా కూడా సమాజానికి దాని వలన మంచి జరుగుతుంటే అది 'మంచి" కిందే లెక్క ఈ విధమైన భావనలు మచ్చు కెక్కడా కనబడని స్థితి కి గ్రామ సీమలు దిగజారి పొయ్యాయి. ఈ మధ్య నే మా ఊరిలో ఒక పెద్దాయన పొయ్యాడు. వారి ఒక్క గానొక్క కుమార్తె చాలా ఘనంగా వారి కర్మ కాండలు చేసింది. ఊరంతా వెళ్లి సుష్ట్టుగా భోజనం చేసి ఆయన పేరిట ఇచ్చిన జ్ఞాపికలు అందుకొని వచ్చారు. ఆ వెనుకే " ఆయన మందులకి డబ్బు యీయక పొతే నెప్పికి తట్టుకోలేక ఆత్మహత్యచేసుకున్నాడని ......బ్రతికుండగా ఆయన చేత ఆ మహా తల్లి మరుగు దొడ్లు కూడా శుభ్రం చేయించేదని" చెప్పుకున్నారు. కానీ ఒక్కళ్ళు కూడా ఆ భోజనానికి వెళ్ళడం మాన లేదు. ఆ జ్ఞాపికలు తెచ్చుకోడం ఆపలేదు.
మురుగు కాలువ కంపుతో చచ్చేవాడికి కెమికల్ ఫ్యాక్టరీ కంపు తోడైనట్లు ఇప్పుడు ఆ దుర్ఘందానికి టీవి కంపు కలిసి ఆ దుర్ఘందాన్ని నలు వైపులా వెదజల్ల జేస్తోంది. దీనికి ఇక అంతం లేదా....అని మాత్రం బాధ పడనవసరం లేదు. ఒక కొత్త కల్చర్ పుట్టి ...... చక్కగా మరలా స్త్రీలు శ్రామిక శక్తి గా ఎదిగి ఈ మండువా లోగిల్ల నుండి బయటకు వచ్చి చక్కగా భర్తతో పొలం వెళ్లి పొలంలో కూడా చిన్న చిన్న పనులు కనీసం కూరగాయలు పండించడం లాంటి ఆదాయ వనరులు పెంచే పనులు చేసుకుంటూ మిగిలిన సమయాన్ని పది మంది కోసం వినియోగించ వలసిన అవసరం కలిగినప్పుడు..దీని నుండి స్త్రీలు ,సమాజం విముక్తి చెందుతారు .ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆశిద్దాం.