21, ఆగస్టు 2011, ఆదివారం

భలే మంచి లాభసాటి ఉద్యమం ...

అబ్బ ....యెంత ఆనందం....ఒక మహా  ఉద్యమం మొదలవ్వ బోతోంది. చాలా సంతోషం. ఆన్నాహజారే ప్రారంబించిన ఉద్యమానికి మంచి ప్రోత్సాహం లభిస్తోంది. బహుశా  ఈ పదేళ్ళ కాలంలో ప్రజలు ఇలాంటి ఉద్యమాన్ని చూడలేదేమో. మీడియా కూడా మంచి ప్రచారాన్నిస్తోంది. వాళ్ళకు చాలా రోజుల వరకూ సెన్సేషన్ కోసం వెదుక్కోవలసిన అవసరం తప్పుతుంది.  ఈ  నేపధ్యంలో రెండు మూడు ఆత్మ హత్యలు జరిగినా ఆశ్చర్య పోనక్కరలేదు. లేదంటే  జరిగిన మరణాలన్నీ కూడా ఆత్మ హత్యలుగా మిగిలే అవకాశం కూడా యెక్కువే. చాలా మందికి ఇప్పటికే ఒక అవగాహన వచేసింది. ఈ ఉద్యమంలో పాల్గొంటే అరెస్ట్ లు లాంటివి జరిగే అవకాశం తక్కువే. జరిగినా కూడా దానివలన ప్రమాదం యెమీ ఉండదని కూడా అందరికీ తెలుసు ..అంతే కాదు అక్కడ కూడా మన పాండితీ ప్రకర్ష ప్రదర్శించొచ్చు..  ఆనంద పడ్డ స్టేషన్  స్టాఫ్ మనకు టీ లు సప్లయ్ చేసే అవకాశాలూ యెక్కువే.. యే విధంగా చూసినా చాలామందికి ఇది లాభసాటి ఉద్యమమే.
                   ఇది చాలా మందికి కోపం తెప్పించవచ్చు. కానీ మనం ఒక్క సారి కొన్ని విషయాలను సావధానంగా అవలోకిద్దాం. నేననుకోవడం ప్రకారం ఐతే చాలా మంది ఆ బిల్ ముసాయిదా కూడా చదివి ఉండరు. వూరేగింపులో పాల్గొని మాంచి ఆవేసం తో ఊగిపోతున్న కుర్రాడిని పిలిచి మనకేమి ఉపయోగమమ్మా యీ జనలోక్  పాల్ బిల్ వలన అని అడిగాను. ఆ కుర్రాడు తనకొచ్చిన యెస్.యెం.యెస్.  లో ఉన్న సారాంసాన్నాంతా చక్కగా చెప్పేసాడు.
 అప్పుడు అడిగాను..."నీవు చెప్పినదంతా బాగానే ఉంది కానీ నీవు చెప్పిన దానికి ..జన్ లోక్ పాల్ బిల్ కు సంబందం యేమిటి?"
" అదేంటి సార్...అందుకే కదా జన్ లోక్ పాల్ బిల్ తెస్తుంట"
నాకేమని చెప్పాలో అర్ధం కాలేదు.
ఒక్క సారి మనం మన దేశ పరిస్థితిని చూద్దాం. లెక్కల ప్రకారం మనం అభివృద్ది పధం లోనే ఉన్నాం. ఒక్క సారి గ్రామాల్లోకి వెళ్ళి వాస్తవాలు చూద్దాం. యెంత మంది రైతులు ఆనందంగా వ్యవసాయం చేస్తున్నారు? వ్యవసాయాధారిత పరిస్రమలు యేవైనా  మనగలిగి ఉన్నాయా.. కళ కళ లాడుతూ ఉండ వలసిన గోదావరి జిల్లాల లోని గ్రామాలు కూడా ఇప్పుడు యెలాంటి పరిస్థితి లో ఉన్నాయ్ ?


                యీ నాడు మనకున్న అతి ముఖ్య మైన సమస్య అదేనని కూడా చాలా మందికి తెలుసు. మరి దీనికి జన్ లోక్ పాల్ బిల్ కు యేమైనా సంబంధం ఉందా....ఇదొక్కటేనా.. ...రగులుతున్న సమస్యలు యెన్ని లేవు? వాటి కోసం యే చర్చా జరగదు...జరిగినా మనం పట్టించుకొం. ఒక్క సారి అంధ్ర జ్యోతి లో  శ్రీ  రామఛంద్రగుహ  రాసిన ఒక ఆర్టికల్ లోని ఒక్క వాక్యం ఇక్కడ రాయడం చాలా అవసరం అని నేను భావిస్తున్నాను. " నాగ్పూర్ లో లేక్మీ కంపెనీ వాల్ళు పెట్టిన ఫేషన్ షో కవర్ చేయడానికి 140 మందికి పైగా జర్నలిస్టులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. కానీ యీ చుట్టు పక్కలే జరిగిన లెక్కలేనన్ని రైతుల ఆత్మ హత్యలు కవర్ చేయడానికి 6 గురు  జర్నలిస్టులు కూడా  లేరు. " యీనాడు ప్రతీదీ మార్కెట్ వస్తువైనట్లుగానే  ఉద్యమాలు కూడా మీడియా కు మర్కెట్ ను తెచ్చి పెడతాయి. అందుకే వాళ్ళు చాలా సెలెక్టివ్  గా ఉంటారు. మార్కెట్   కాని ఉద్యమం వాళ్ళకు అవసరం ఉండదు. మరి యిదొక్కటే మార్కెట్ సరుకుగా మీడియా యెందుకు యెంచుకుందో ఒక్క సారి మనసు పెట్టి అలోచిద్దాం.
1. యీ ఉద్యమం లో పాలు పంచుకొనే వారికి యెలాంటి భయం ఉండదని మనం ముందుగానే అనుకున్నాం. కాబత్తి సహజం గానే పట్టణ మధ్య తరగతి ప్రజలు దీనిలో గరంటీ గా పాలుపంచుకొంటారు. నగరాల్లో జరిగే ఉద్యమాలను మాత్రమే అసలైన ప్రజా ఉద్యమాలుగా భావించే నేటి పరిస్థితులలో దీనికి మాంచి గిరాకీ ఉంటుందని మీడియా పెద్దలకు బాగానే తెలుసు.
2. ప్రెస్సర్ కుకర్ లా ఉన్న నేటి సమాజం లో కొంత ప్రెసర్ ని యేదో రూపం లో బయటకు పంపడం అధికార పీఠాలలో ఉన్న వారికి చాలా అవసరం. అందుకు యేదో ఒక ప్రమాద రహిత ఉద్యమానికి అన్ని వైపుల నుండీ మద్దతు అవసరం. లేదంటే యీ ప్రెసర్ వలన జనం అంతా భిన్న రూపాలు ..అంటే ఆ పీఠాలు కదిలించే ఉద్యమాలలోకి మళ్ళుతారు. యీ భావజాలాన్ని కాపాడుకొంటూ పై పై మెరుగులకే మీడియా ఇస్టపద్డుతుంది కాని పునాదుల మార్పంటే వాటికి కూడా భయమే....
యీ మధ్య పేపర్ చూస్తున్న వారికందరికీ ఒక్క విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇంతకు ముందు యెక్కువగా ఆకలి చావులు ఉండేవి.కానీ యీ మధ్య కాలంలో అవి రైతుల ఆత్మ హత్యలుగా మార్పు చెందాయి. కేవలం వ్యవసాయాన్ని ఒక వృత్తిగా స్వీకరించిన పాపానికి అనేక వేల మంది రైతుల ఆత్మ హత్యలు దేశంలో జరుగుతున్నప్పుడు మన స్పందన యేమిటి? మీడియా వారు చూపిన శ్రద్ద యేపాటిది?
చాలా కాలం క్రితమే మా వూరిలో జరుగుతున్న మార్పులు  చూసి యేదో మనకు తెలియకుండానే రైతులను నెమ్మదిగా యీ వృత్తి నుండి ద్దొరం చేసే పరిస్థితులు యేర్పడుతున్నాయేమోనని అనిపించేది. మా వూరు రాజమండ్రి పట్టణానికి అతి సమీపంగా ఉందే గ్రామం. నేను చదువుకుంటున్న రోజుల లోనే  పట్టణాన్నుండి బంగారం వ్యాపారస్తులు ,బట్టల వ్యాపారస్తులు మా వూరిలో భూములు   కొంటున్నప్పుడు నాకు అనిపించేది...మన రైతులు ఒక్కరు కూడా పట్టణాల్లో ఆస్తులు యేవీ కొనలేకపోతున్నారు..కానీ ఆస్తుల విలువ లెక్క గడితే పొలాల విలువా ఆయా వ్యాపారస్తుల పెట్టుబడులకన్నా అనేక రెట్లు యెక్కువగానే ఉండేవి. నేను ఆర్ధిక శాస్త్ర విధ్యార్ధిని కాదు కానీ యేదో తెలియని సమీకరణాలు రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని అర్ధం అయ్యేది.
యేమాత్రం ఆర్ధిక శాస్త్ర  జ్ఞానం లేని నాకే ఆ మాత్రం అర్ధం అయ్యినప్పుడు మనకున్న మేధావులెందరికో యీ విషయం అర్ధం అయ్యే ఉంతుంది. కానీ పరిస్థితులు ఆత్మహత్యలకు దారి తీసినా రాజధాని వీధులలో యే రైతూ ఊరేగింపు తీయలేకపోయాడు కాబట్టి అది భారత దేశపు సమస్యగా మన మీడియా  గానీ యీ రోజు ఊరేగింపులు తీస్తున్న వర్గాలకు గానీ పట్టలేదు.
ఒక సమస్య మీద పోరాడడం తప్పు కాదు ఆ పోరాటాన్ని సమర్ధించడం పొరబాటు కాదు కానీ పొలాలు వదిలి పారిపోతున్న రైతుల గురించి  అలోచించడం ముఖ్యమా....లేక ప్రధాన మంత్రిని లోక్పాల్ పరిధి లోకి తేవడం ముఖ్యమా..అనేది విజ్ఞులే అలొచించుకోవాలి.
ఆ నాడు జాతీయోద్యమం మొదలైనప్పుడు కూడా మనం దేని కోసం పోరాడుతున్నామన్నది ఆ పోరాటం  లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ఒక అవగాహన ఉండాలని...కేవలం రాజకీయ స్వాతంత్రయం వలనే మన సమస్యలు తీరి పోవనీ...పోరాడ  వలసిన అంశాలు  ఇంకా అనేకం ఉన్నాయని ఆనాటి మేధావులు కూడా నొక్కి వక్కాణించారు.  అది యీ  నాటికీ కూడా మనం పట్టించుకోము. కేవలం మనకు విలన్లు ప్రధానమంత్రి..జుడీషియరీ  యేనా ....ఇంకెవరూ కాదా....అసలు మన చుట్టూ ఉన్నవారి  పాత్రా...దానికి మన ప్రతిస్పందనలూ..ఒక్క సారి చూద్దాం.....
ఒక సారి విజయవాడ రైల్వే స్టేషన్  అప్పర్ క్లాస్ వెయిటింగ్  రూం లో కూర్చుని  ఉన్నాను. రాత్రి 12 గంటలు దాటి ఉండవచ్చు..వస్తున్నవారి వివరాలు..రిజిస్టర్  లో రాయడానికి ఒక అటెండెర్  ఉంటారు. సాధారణంగా యిది కూర్చుని చేసే ఉద్యోగమే కాబట్టి స్త్రీలనే అక్కడ కూర్చో బెట్టదం జరుగుతుంది. ఒక వ్యక్తి సుమారు 40 సం. ల వయస్సు ఉండవచ్చు..తన కుమారుడితో.. ప్రవేశించడం  జరిగింది.. ఆవిడ వివరాలు అడిగింది. అతడిది జనరల్ టికెట్ కావడంతో ఆవిడ మర్యాదగా ఆయనను జనరల్ వెయిటింగ్  హాల్ కు వెళ్ళమని చెప్పింది. అతడు వినకుండా అక్కడే కూర్చున్నాడు..ఆవిడ అడుగుతుంటే "ఉండమ్మా...రిజర్వేషన్ చేయించుకొంటాం.".అంటూ దబాయిస్తున్నాడే కానీ అక్కడ నుండి మాత్రం కదల లేదు. జనం అంతా చూస్తున్నారు...కానీ యెవ్వరూ మాట్లాడడం లేదు. కానీ ఒక తోటి రైల్వే ఉద్యోగిని కాబట్టి యిది చూస్తూ ఊరుకోడం నా వాల్ల కాలేదు..తగిన శాస్తి జరిపించాను అది అంత ప్రధానం కాదు. కానీ   ఇక్కడ నేను చెప్ప దలుచుకున్న దేమిటంటే బాధ్యత గల పౌరుడిగా   మన వంతు కర్తవ్యాన్ని కొంతైనా మనం చేయం....." అన్నా హజారే ..జిందాబాద్..అంటూ.."గొంతు చించుకుంటాం...  కానీ కనీసం ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ ఉన్నా కూడా ధీమాగా ముదుకు పొయిన వాడిని నాలుగు పీకుదాం..అని మాత్రం అలోచించం. రిస్క్ యెవరిక్కావాలండీ...ఇదీ మన దౌర్భాగ్యపు పరిస్థితి..


                  ఇది మనకు ప్రతిదినం అనేక చోట్ల యెదురయ్యే దృశ్యమే ....కానీ మనది అతి మందమైన చర్మం కాబట్టి  ఇవన్నీ మనకు సాధారణమైనవి గానే కనిపిస్తాయి. ప్రస్తుతం పెందుర్తి గ్రామం నుండి  వైజాగ్ రైల్వే స్టేషన్  మరియు బస్ కాంప్లెక్స్ వరకు BRTS రోడ్ ఇంచుమించు పూర్తి కావస్తోంది. దీనివలన కొన్ని లక్షల మంది ప్రయాణీకులు యెంతగానో లాభపడతారు. ఆ రోద్ లో ప్రయానించే వాళ్ళకు ఒక చోట యీ పని లో బ్రేక్ కనబడుతుంది. వేపగుంట అనె సెంటెర్ కు ముందు రెండు చిన్న చిన్న మందిరాలు ఉంతాయి. వాటిని చూస్తే అవి యీ మధ్యనే అంటే 20 సం. లోపులొనే కట్టినవని అర్ధం అవుతుంది. ఇంతమంది ప్రయాణీకులు లాభపడతారని తెలిసినా ఆ మందిరాలను యెవ్వరూ కదప లేక పొతున్నారు. మందిరాలకి ..మానవత్వానికి దూరం సహజంగానే యెక్కువగానే ఉంటుంది కానీ అధికారులు....యువకులు ..ప్రజాసంఘాలు...మరి సో కాల్డ్ మీడియా యేమి చేస్తుందో తెలియదు. మరి అన్నా హజారే ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ వూరేగడం కంటే ఇటువంటివి ముఖ్యమని యెందుకు అనిపించడం లేదు. నేను ఒక్క వైజాగ్ లో రోజూ గమనిస్తున్న ఒక్క సమస్య గురించి ప్రస్తావించాను. మరి వెదికితే ప్రతి చోటా ఇటువంటివి యెన్నో ఉంటాయి. కానీ అవి మన దృస్టికి కనబడవు. కారణమైతే  నాకు ఒక్కటే కనబడుతుంది. మనమంతా ఒక అధీకృత భావజాలానికి అతీతంగా అలోచించడానికి ...యేదైనా ఆచరించడానికి వెనికాడుతూనే ఉంటాం. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మధ్య తరగతి నుండి వచ్చిన విధ్యార్ధులకు సినిమాలు ,షికార్ల కంటే కూడా ఒక ఉద్యోగం, కుటుంబానికి తగినంత ఆసరాగా నిలబడడం తక్షణ అవసరం. కానీ కాలేజ్ లలో అది అధీకృత భావజాలం కాదు. నేను చదివిన తణుకు అప్పటికింకా గ్రామమే...అందులో ఉన్న మా కాలేజ్ ఆవూరికి గొప్పదే కాబట్టి కొత్త సినిమాకు అడిగినన్ని టికెట్స్ ఇవ్వలేదని గొడవకు బయలు దేరితే నా వెనుక వంద మంది పైగానే చేరేవారు. కానీ "ఉద్యోగమైనా...చూపండి లేదా జైల్లో ఐనా పెట్టండి " అన్న స్లోగన్ తో ఊరేగింపుకు బయలుదరినప్పుడు అందులో మా స్నేహితులం నలుగురిమే ఉన్నాము. పైగా ఆ రోజు బజార్ లో మాకు యెదురు వచ్చిన మా కాలేజ్ మేట్స్ మమ్మలని వింతగా  చూసారో లేదో తెలియదు కానీ మా మనసులో ఫీలింగ్స్ అలానే ఉన్నాయ్. ఐతే కాస్తో కూస్తో మొండి తనం ఉంది కాబట్టి..మేము చేస్తున్న పని మాకే కాకుండా పదిమందికీ మంచి చేస్తుందన్న అచంచల విస్వాసం ఉంది కాబట్టి మేము మా ప్రయాణాన్ని కొనసాగించాం.. మా భావజాలమే అక్కడ అధీకృత  భావజాలంగా నడిచేలా చేయగలిగాం.
టీవీలు....ఇంటర్నెట్ ..అంతకంటే దరిద్రమైన సెల్ ఫోన్ లు యువత ను సామాజిక బంధాల నుండే కాకా, సామాజిక అవసరాలను, సామాజిక సిద్దాంతాలను పట్టించుకోడం పూర్తిగా మానేసారు కాబట్టి కేవలం  రేటింగ్స్  కోసం గడ్డి తినే చానల్స్ వారు చాప క్రింద నీరులా ప్రవహింపచేస్తున్న మాయాజాలం లో పడకండి. మీరు అన్నా హజారే లా ఇక్కడ యేదైనా చేస్తే వారు కవర్ చేయరు. మీరందరూ కలసి ఊరేగింపులు తీస్తేనే వాళ్ళు కవర్ చేస్తారు. యెందుకంటే వాళ్ళకు యెప్పుడూ ఒక మార్కెట్ విలువ ఉండే వస్తువు కావాలి. మీరు ఊరేగింపులు తీస్తే అక్కడ ధిల్లీలో దీక్ష చేస్తున్న వారి మార్కెట్ విలువ ఇతోధికంగా పెరుగుతుంది. కాబట్టి మీరే అన్న హజారే లా ఉండాలో...లేక అన్నా హజారే కోసం ఊరేగింపులు చేసేవారిగా ఉంటారో మీరే తేల్చుకోండి.


అనుకున్నట్లుగానే అంతా సుఖాంతం అయ్యింది. ఒక్క సారి ప్రభుత్వం ప్రకటించిన లోక్ పాల్ ముసాయిదా ను ,అన్నా హజారే ప్రతిపాదించిన ముసాయిదా ను కూలంకషంగా ఒక్క సారి పరిశీలించండి. నాకైతే రాణీ గారు సన్నజాజుల బదులు మల్లెలు తెచ్చిన రాజా వారి మీద అలిగిన చందాన అంపించింది. దాని కోసం ఇంత హంగామా చేయడం అవసరమా....యేమో తెలియదు. నాకైతే మాత్రం అనేకానేక సమస్యల వలయం లో ఉన్న మనం యీ ఒక్క సమస్యనే జాతీయ సమస్య గా చేయడం వలన అసలు సమస్యలు పక్క దారి పడుతున్నాయేమో అనిపిస్తుంది. యేది యేమైనా అన్నా నిమ్మరసం తాగేసారు కాబట్టి నాకు మాత్రం కొంత ఉపసమనం కలిగింది. యెందుకంటే నిన్ననే ఒక నటీమణి  తన వీపు మీద అన్నా టాటూ వెయించుకొని పత్రికలకు ఫోజిచ్చింది. ఆయన ఇంకా ఇదే దీక్షలో కొనసాగుతుంటే ఇంకా మిగిలిన వారు ఇంకెక్కడ ఆ టాటూ లు పొడిపించుకుంటారో అన్న టెన్షన్ తో చచ్చి ఉండేవాడిని. ఒకసారి మంచి మార్కెట్ కు యెక్కిన దేనినీ మన వాళ్ళు వదలరని  తెలుసు కదా.. 
ఇందాకనే జే.పీ ఒక ఇంటర్వ్యూ లో ఒక మాట చెప్పడం విన్నాను. అందరిలో మార్పు కోసం తపన, పోరాడే పటిమ ఉంటేనే యే ఉద్యమమన్నా ముందుకు వెళ్ళతాయే తప్ప యే ఒక్కరి మీదో ఆధార పడి ఐతే కాదు. ఒక సారి యేదైనా పేరు వచ్చిన గుడికి వెళ్ళి చూడండి. యేదో ఒక అడ్డ దారిలో (వీ.ఐ. పీ కోటా, స్పెషల్ దర్శనాలు కూడా యీ కోవలోకే వస్తాయి) దేవుడిని దర్శించుకుందామనే తపన, అంటే కనీసం అక్కడ కూడా మనం యెంతో కొంత న్యాయాన్ని పాటిద్దామని ప్రయత్నించం. దేవుడి దగ్గరే అడ్డదారులు అంగీకారం అయినప్పుడు మిగిలిన చోట్ల అదే దారిలో వెళ్ళడానికి మనమెందుకు ప్రయత్నించం. అంతేకాదు నీవు తలనీలాలు సమర్పించుకొంటేనే సర్వ పాపహరణం జరుగుతుందని నమ్మడంలో యెన్ని ప్రమాదాలో ఒక్కసారి చూద్దాం. నీవు పాపం చేసావంటే సమాజం లో యెవరి కో నీ వలన అన్యాయమో..అపకారమో జరిగి ఉంటుంది. దానికి పరిహారం యేమిటంటే తిరిగి నీ వలన నష్త పోయిన వారిని యేదోలా ఆదుకోవడం..లేదా అది వీలు కాక పోతే అవసరం లో ఉన్న మరొకరికైనా సాయం చేయడం. ఇదే హేతుబద్దమైనదని విజ్ఞులెవరైనా ఒప్పుకుంటారనే భావిస్తున్నాను. కానీ దీనిని కాకుండా గుడికి వచ్చి తలనీలాలు ..అర్పించుకోడం..లాంటివి చేయడం వలన యెవరికి లాభం...నాకేమని అనిపిస్తుందంటే దీంట్లో ఉన్న ఒకే ఒక సౌలభ్యం వలన ప్రజలు యీ పద్దతిని అమోదించేసారని. అదేమిటంటే నీవు అపచారమో ..లేక అన్యాయమో చేసినట్టు యెవరికీ తెలియకుండానే నీ పాప పరిహారం జరిగిపోతుంది...యీ పద్దతిలో. అందుకు యీ గుళ్ళ చుట్టూ మహాత్యాల కధలు సృష్టించబడ్డాయి ...వాటినే నమ్ముకుంటూ మనం మాత్రం సమాజాన్ని అధోగతిలోకి నెట్టుతూనే ఉన్నాం.


మనమెంత పాపమో లేక అన్యాయమో చేసినా  కూడా దాని  పరిహారం సమాజానికి యే మాత్రం జవాబుదారీ తనం వహించకుండానే జరిగిపోతోంది...ఆహా యెంత గొప్ప సౌలభ్యం..యీ విధమైన సౌలభ్యం మిగిలిన మతాలలో ఉందో లేదో తెలియదు కానీ యీ విధమైన సామాజిక, తాత్విక చింతన ఖచ్చితంగా మనను ఖచ్చితంగా పాతాళానికి గెంటుతూనే ఉంది. పుణ్య సాధనకు గుడికి వెళ్ళి పూజలు చేసే వారిని, తల నీలాలు అర్పించుకునే వారిని నేను యే మాత్రం ఆక్షేపించను యెందుకంటే అది వారు నమ్మిన ధర్మం లో భాగం.


ఒక సారి మా అమ్మాయి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రారంభానికి ముందు హాల్ టికెట్స్  గుడికి తీసుకెళ్ళి పూజ చేయిస్తున్నారు నాన్నా  నేను కూడా వెళ్తాను అన్నది. ణేను ఒక్క విషయం తనకు అర్ధం అయ్యేలా చెప్పాను. మార్కులకి పూజకు సంబందం పెట్టకు ..నీకు వేరే వారి అక్రమాల వలన అన్యాయం జరగకుండా చూడమని మాత్రం ప్రార్దించు. ఇంకొక విషయం యేమిటంటే అక్రమం జరిగ్తుందని ఒక వేళ నీకు తెలిస్తే దాని నివారణకు మార్గం దేవుడిని అడగకు. పోరాడడం మన పని. ఒక విషయం నాకు అర్ధం కాని దేమిటంటే మనం మన తలిదండ్రుల మీద భారం తగ్గించాలంటే వాళ్ళు చేస్తున్న పనిలో  భాగస్వాములవుతాం. అదే విధంగా మనం నిజంగా భగవంతుడిని పూజించాడం కంటే ఆయన చేయవలసిన పనిలో భాగస్వాములమైతేనే ఆయన సంతోషిస్తాడని అనిపిస్తుంది. కాబట్టే ప్రజల నుండి వసూలు చేసిన సొమ్ముతో గుడి కట్టిన రామ దాసు కంటే ఆ విధంగా చేసిన ఆయనను జైలులో వేసిన తానీషాయే గొప్పవాడిగా  కనిపిస్తాడు.
యీ క్రింది మెయిల్ ఇప్పటికే చాలా మందికి వచ్చి ఉంటుంది ..మరి పోరాటం యెలా మొదలవుద్దో చూద్దాం.