23, ఫిబ్రవరి 2014, ఆదివారం

తెగగొట్ట వలసిన అనైతిక బంధం......

నా చిన్ననాటి స్నేహితుడు యాగంటి వేంకటేశ్వర్లు ఒక మంచి జోక్ పంపించాడు .

Man was baptized and dipped in water 3 times. After the 3rd dip priest said " you are now baptized, the old one is gone, you are now a new creation, no more drinking of alcohol for you and your new name is James "
James went home, headed straight for the fridge, took out a beer and dipped it in water 3 times and said " you are a new creation now, the old one is gone and your new name is orange juice.


పై జోక్ ని తెలుగు లోకి అనువదిస్తే ఈ విధంగా ఉంటుంది . 


వ్యక్తి బాప్టిజం చేయబడి ....3 సార్లు నీటిలో ముంచబడ్డాడు. 3 వ డిప్ పూర్తయిన వెంటనే ....పూజారి "మీరు ఇప్పుడు పూర్తిగా మారిన మనిషి ....పాత అంతా పోయింది మీరు .....మద్యం నుండి పూర్తిగా దూరంగా ఉంటారు ..... మీ కొత్త పేరు జేమ్స్ .
జేమ్స్, తిన్నగా ఇంటికి వెళ్ళి ఫ్రిజ్ తెరిచి ఒక బీరు తీసుకుని 3 సార్లు నీటిలో ముంచి మరియు మీరు ఇప్పుడు కొత్తగా సృష్టించ బడ్డారు ...మీ గతం అంతా గతించింది మీ కొత్త పేరు నారింజ రసం అన్నాడు.


అతగాడు ఇది జోక్ గానే పంపించాడు కానీ ఇది ఇప్పుడు అన్ని మతాలలోను ..... ఇంచుమించుగా ఇదేగా నడుస్తుంది .ఈ నాటి మనదౌర్భాగ్యాల కు అవినీతి కారణమని అందరూ ఒప్పుకుంటారు (ఒక్క సి. పీ.ఎం పార్టీ వారు తప్ప .....వారి విప్లవ కార్యకలాపాలలో అవినీతి ముద్ర వేసుకున్న వాళ్ళూ తోడూ నీడగా ఉండొచ్చట ). కానీ అంత యధేచ్చగా అవినీతికి పాల్పడే మనస్తత్వం గాలి చొరబడినంత సుళువుగా ఎలా చొరబడిపోతోంది? దానికి తాత్విక భూమిక సమాజం లో ఏ ఆటంకమూ లేకుండా ఎవరు వ్యాప్తి చేయగలుగుతున్నారు ? కావాలని ఒక అరాచక వాతావరణం ఎవరి వలన ఏర్పడుతోంది ? ఏ  గ్రంథాల ల లోనూ రాయని వన్నీ ప్రజలమీద రుద్ది  సమాజంలో లంపెన్ సైన్యాన్ని తయారు చేసి సిద్దాంత రాజకీయాలు లేకుండా చేయడానికి ఏ శక్తులు కృషి చేస్తున్నాయ్ ? అన్ని వయసుల వారి లో ఇంత ఉదాసీన వైఖరి ఎలా వచ్చింది ? ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్యూన్ ఉద్యోగాలకు ....కానిస్టేబుల్ ఉద్యోగాలకు .....అవీ లేకుండా చేస్తున్నా చలనం లేకుండా ఎలా ఉండగలుగు తున్నారు? హేతు బద్దంగా ఆలోచించే శక్తి ని ప్రజలనుండి దూరం చేయడానికి యధావిధిగా కృషి చేస్తున్నదెవరు?
 నల్లదుస్తులు వేసుకుంటే ...ఇంత పుణ్యం ......ఎర్ర దుస్తులు వేసుకుంటే ఈ పుణ్యం ......ఇంకా కాన్వెంట్ స్కూళ్ళకు ఎన్ని యూనిఫారాలు ఉంటాయో ....భక్తికి కూడా అన్ని యూనిఫారాలు తయారు చేసి ప్రజలను నిజంగా భక్తి మార్గంలోకే ఈ పురోహిత వర్గాలు  మళ్ళిస్తున్నాయా .....? మూఢ భక్తి /మూర్ఖ భక్తి ని అధికారిక భక్తి మార్గంగా ఎవరు చలామణి చేయగలుగుతున్నారు ? సమాజం లో బలమైన సిద్దాంతాలు లేకుండా ఉండడం కేవలం అరాచక స్వార్ధపర శక్తులకే మేలు కలుగుతుందని తెలిసి కూడా ఆ పరిస్థితి నుండి సమాజాన్ని బ్రతికించడానికి ఏ రాజకీయ పార్టీ అయినా నిజాయితీ గా కృషి చేస్తుందా ....? అంటే అన్ని మతాలలోని పురోహిత వర్గాలు ఒక అరాచక తాత్విక పునాదిని సృష్టిస్తుంటే .......దానినుపయోగించుకుని అధికారం లోకి రావడానికి సిద్దాంతాలు అవసరం లేని అన్ని రాజకీయ పార్టీలు యధావిధిగా కృషి చేస్తునాయి .అందువలనే కదా ఒక పార్టీ అధికారం లోకి అర్ధం కాగానే చొక్కా మార్చినంత సుళువుగా వేరొక రాజకీయ పార్టీలోకి మారిపోతున్నారు.మారేటప్పుడు కూడా సైద్దాంతిక నిబద్దత లేని పార్టీలోకి మారతారు తప్ప  సిద్దాంతాలను అంటి పెట్టుకునే పార్టీల లోకి మాత్రం మారరు. అది పెద్ద తప్పేమీ కాదనే విధంగా మన తాత్విక దృక్పధాన్ని ఉంచడానికి మత వర్గాలు కృషి చేస్తూనే ఉంటాయి

నిజాయితీగా .....దేశానికీ ....సమాజానికీ ఏదైనా చేయాలనుకునే అభ్యుదయ వాదులు కానీ ...విప్లవకారులు కానీ  చేయవలసిన మొదటి పని ఈ అనైతిక బంధాన్ని తెగగొట్టడం.....అది చేయకుండా ముందుకు వెళ్తే మాత్రం పునాది లేకుండా భవనం నిర్మించడమే అవుతుంది.