31, జనవరి 2011, సోమవారం


మా నాన్న గారు ,అమ్మ. గోదావరి కి దగ్గరలోనే ఉన్న రెండు ప్రాంతాల అభివృద్ధి లో ఉన్న తేడా ల ఫలితంగా ఏర్పడిన కుటుంబ నేపధ్యాల మేలు కలయికే మా అమ్మ, నాన్న గార్లు. కాలువల వలన వచ్చిన అభివృద్ధి ఫలాలు చేతికందిన వారిలో త్వరగా మొలకెత్తే వ్యాపార దృక్పదం మా తాతయ్య( మా అమ్మ గారి తండ్రి) లో బాగా కనబడేది. కానీ బలమైన వ్యావసాయిక నేపధ్యం కాబట్టి ఏ పనైనా చాలా సహనంగా ,బలంగా చేసే వాడు. ఇంచుమించు అవే లక్షణాలు మా అమ్మవీను శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ.....

30, జనవరి 2011, ఆదివారం

మా అత్తా మామ గార్లు


మా అత్త మామ గార్లు...... కనుమరుగవుతున్న గ్రామీణ స్వచ్చతకు దర్పణంగా ఉండేవారు. ఇంకా ఉండేవారేమో....డిసెంబర్ ౨ ౨౦౦౭ తెల్లవారు ఝాము మా మామగారి కి మృత్యు పాశం విసరక పొతే......ప్రస్తుతం మనం అనుకుంటున్నా అభివృద్దికి చక్రాలు ఉంటున్నాయి కానీ కళ్ళు వుండడం లేదు. వేగం ఒక్కటే దానికి తెలుసు. పల్లెలు ఆ అభివృద్ధి కి అలవాటు పడేటప్పటికి వాటి మూలాలు సమూలంగా కనుమరుగయ్యేతట్లున్నాయి.

ఎన్ని మార్పులు.....

తలుచుకుంటుంటే ఒక్కక్కప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏ ఊరిలో మార్పులు చూసినా మన దేశంలో మార్పులు అర్ధం చేసుకోవచు. మాఊరేమీ ప్రత్యేకం కాదు. ముందు ముందు ఇంకా ఏ మార్పులు రానున్నాయో వుహిస్తుంటే ఎప్పటి కప్పుడు ఒక వీడియో కెమెరా తో జరుగుతున్న ప్రతి ఫంక్షన్ రికార్డు చేసుకోవాలని పిస్తోంది. అది ఎవరిదైనా మరణం కావచు లేదా పెళ్ళైనా కావచ్చు. మన చేస్తున్న పనిలో నిజాయితీ శాతం చూస్తుంటేనే బాధగా వుంటుంది. ఇంటికి వెళ్ళగానే అతిధులకి ఇత్తడి చెంబుతో కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళిచ్చి ఆహ్వానించే రోజులనుండి ముక్తసరిగా ఒక్క మాటతో పలకరించి టీవి సీరియల్ లో తలడుర్చే సంప్రదాయానికి vacchesaము .