10, జులై 2013, బుధవారం

చిత్తగించవలెను



ఇద్దరూ ప్రమాద కారులే....ఇద్దరూ క్రూరులే....ఇద్దరి వల్లా దేశ భద్రతకు సమాజ భద్రతకు ప్రమాదమే......ఐనా చిన్న  పోలికల పట్టిక

 


టెర్రరిస్ట్
ఆర్ధిక నేరగాడు
ఇతడు తను నమ్మిన దాని కోసం మరణిస్తాడు
తను ..తన వాళ్ళు సుఖంగా ఉండడానికి మాత్రమే ఎంతటి నేరమైనా చేస్తాడు
ఇతడి ఆవేశం ప్రేరేపితం
అంతా తన స్వార్ధం కోసమే కాబట్టి చాలా ప్లాన్ డ్ గానూ ముందస్తు జాగ్రత్తతోనూ ఉంటాడు
నమ్మినదాని కోసం  చావడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటాడు
తన స్వార్దం మాత్రమే తన సిద్దాంతం. వ్యవస్తను నట్టేట ముంచి 60-70 బెడ్ రూం భవంతుల్లో ఉంటారు.
ఏదో ఒక సిద్దాంతాన్ని అనుసరిస్తాడు.
తన సుఖమే..స్వార్ధమే  నేరానికైనా మూలం
క్రూరత్వం స్పష్టంగా పైకి కనబడుతుంది. కాబట్టి నటించే అవకాశం ఉండదు.
మేకవన్నె పులులు. అందుకనే త్వరగా ఫాక్షనిజం నుండి దీనికి మారుతున్నారు.
బాధితులు గుర్తించబడతారు కాబట్టి  శిక్షించడం సుళువు.
నిర్దిష్టమైన బాధితులు ఉండరు ...మొత్తం ఆర్ధిక వ్యవస్థే నెమ్మదిగా భ్రష్టు పట్టి పోయి మొత్తం అందరికీ ఒక్క సారే చీకటై పోతుంది. సమయానికి వీళ్ళు హాపీ గా విలాసవంతమైన దేశాల్లో ఉంటారు.
సాధారణంగా  ఏ రాజకీయ పార్టీ కూడా బహిరంగంగా సపోర్ట్ చేసే ధైర్యం చేయదు.
వీళ్ళు చాలా వరకూ ఏదో ఒక రాజకీయ పార్టీల అండదండలతొనే ఉంటారు. కనిమొళి   మరలా రాజ్య సభకు ఎన్నిక కావడానికి ఏదీ అడ్డు రాలేదు.
నేరం  చాలా త్వరగా ఋజువవుతుంది కాబట్టి   త్వరగా శిక్షించబడతాడు.
నేరాన్ని ఋజువు చేయడానికి కొన్ని వేల డాక్యుమెంట్స్ ని పరీక్షించాలి కాబట్టి శిక్ష  వేయడానికి చాలా సమయం పడుతుంది. అందువలనే ఇంచుమించు ఆర్ధిక నేరానికి శిక్ష  పడ్డ రాజకీయ వాది భారత దేశం లో లేడు.
నేరం స్పష్టంగా పైకి కనబడుతుంది కాబట్టి అందరి చేతా అసహ్యించుకోబడతాడు.
యేనాటికి కూడా ఆర్ధిక నేరాల తీవ్రత...దాని ప్రభావం విద్యావంతులే చాలా తేలికగా తీసుకుంటున్నారు.అందువలనే కసబ్ సిక్ష కోసం ఆవేశపడినంతగా కుంభకోణాల నిందితుల శిక్షల కోసం వూరేగింపులు కనబడవు.