23, ఫిబ్రవరి 2014, ఆదివారం

తెగగొట్ట వలసిన అనైతిక బంధం......

నా చిన్ననాటి స్నేహితుడు యాగంటి వేంకటేశ్వర్లు ఒక మంచి జోక్ పంపించాడు .

Man was baptized and dipped in water 3 times. After the 3rd dip priest said " you are now baptized, the old one is gone, you are now a new creation, no more drinking of alcohol for you and your new name is James "
James went home, headed straight for the fridge, took out a beer and dipped it in water 3 times and said " you are a new creation now, the old one is gone and your new name is orange juice.


పై జోక్ ని తెలుగు లోకి అనువదిస్తే ఈ విధంగా ఉంటుంది . 


వ్యక్తి బాప్టిజం చేయబడి ....3 సార్లు నీటిలో ముంచబడ్డాడు. 3 వ డిప్ పూర్తయిన వెంటనే ....పూజారి "మీరు ఇప్పుడు పూర్తిగా మారిన మనిషి ....పాత అంతా పోయింది మీరు .....మద్యం నుండి పూర్తిగా దూరంగా ఉంటారు ..... మీ కొత్త పేరు జేమ్స్ .
జేమ్స్, తిన్నగా ఇంటికి వెళ్ళి ఫ్రిజ్ తెరిచి ఒక బీరు తీసుకుని 3 సార్లు నీటిలో ముంచి మరియు మీరు ఇప్పుడు కొత్తగా సృష్టించ బడ్డారు ...మీ గతం అంతా గతించింది మీ కొత్త పేరు నారింజ రసం అన్నాడు.


అతగాడు ఇది జోక్ గానే పంపించాడు కానీ ఇది ఇప్పుడు అన్ని మతాలలోను ..... ఇంచుమించుగా ఇదేగా నడుస్తుంది .ఈ నాటి మనదౌర్భాగ్యాల కు అవినీతి కారణమని అందరూ ఒప్పుకుంటారు (ఒక్క సి. పీ.ఎం పార్టీ వారు తప్ప .....వారి విప్లవ కార్యకలాపాలలో అవినీతి ముద్ర వేసుకున్న వాళ్ళూ తోడూ నీడగా ఉండొచ్చట ). కానీ అంత యధేచ్చగా అవినీతికి పాల్పడే మనస్తత్వం గాలి చొరబడినంత సుళువుగా ఎలా చొరబడిపోతోంది? దానికి తాత్విక భూమిక సమాజం లో ఏ ఆటంకమూ లేకుండా ఎవరు వ్యాప్తి చేయగలుగుతున్నారు ? కావాలని ఒక అరాచక వాతావరణం ఎవరి వలన ఏర్పడుతోంది ? ఏ  గ్రంథాల ల లోనూ రాయని వన్నీ ప్రజలమీద రుద్ది  సమాజంలో లంపెన్ సైన్యాన్ని తయారు చేసి సిద్దాంత రాజకీయాలు లేకుండా చేయడానికి ఏ శక్తులు కృషి చేస్తున్నాయ్ ? అన్ని వయసుల వారి లో ఇంత ఉదాసీన వైఖరి ఎలా వచ్చింది ? ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్యూన్ ఉద్యోగాలకు ....కానిస్టేబుల్ ఉద్యోగాలకు .....అవీ లేకుండా చేస్తున్నా చలనం లేకుండా ఎలా ఉండగలుగు తున్నారు? హేతు బద్దంగా ఆలోచించే శక్తి ని ప్రజలనుండి దూరం చేయడానికి యధావిధిగా కృషి చేస్తున్నదెవరు?
 నల్లదుస్తులు వేసుకుంటే ...ఇంత పుణ్యం ......ఎర్ర దుస్తులు వేసుకుంటే ఈ పుణ్యం ......ఇంకా కాన్వెంట్ స్కూళ్ళకు ఎన్ని యూనిఫారాలు ఉంటాయో ....భక్తికి కూడా అన్ని యూనిఫారాలు తయారు చేసి ప్రజలను నిజంగా భక్తి మార్గంలోకే ఈ పురోహిత వర్గాలు  మళ్ళిస్తున్నాయా .....? మూఢ భక్తి /మూర్ఖ భక్తి ని అధికారిక భక్తి మార్గంగా ఎవరు చలామణి చేయగలుగుతున్నారు ? సమాజం లో బలమైన సిద్దాంతాలు లేకుండా ఉండడం కేవలం అరాచక స్వార్ధపర శక్తులకే మేలు కలుగుతుందని తెలిసి కూడా ఆ పరిస్థితి నుండి సమాజాన్ని బ్రతికించడానికి ఏ రాజకీయ పార్టీ అయినా నిజాయితీ గా కృషి చేస్తుందా ....? అంటే అన్ని మతాలలోని పురోహిత వర్గాలు ఒక అరాచక తాత్విక పునాదిని సృష్టిస్తుంటే .......దానినుపయోగించుకుని అధికారం లోకి రావడానికి సిద్దాంతాలు అవసరం లేని అన్ని రాజకీయ పార్టీలు యధావిధిగా కృషి చేస్తునాయి .అందువలనే కదా ఒక పార్టీ అధికారం లోకి అర్ధం కాగానే చొక్కా మార్చినంత సుళువుగా వేరొక రాజకీయ పార్టీలోకి మారిపోతున్నారు.మారేటప్పుడు కూడా సైద్దాంతిక నిబద్దత లేని పార్టీలోకి మారతారు తప్ప  సిద్దాంతాలను అంటి పెట్టుకునే పార్టీల లోకి మాత్రం మారరు. అది పెద్ద తప్పేమీ కాదనే విధంగా మన తాత్విక దృక్పధాన్ని ఉంచడానికి మత వర్గాలు కృషి చేస్తూనే ఉంటాయి

నిజాయితీగా .....దేశానికీ ....సమాజానికీ ఏదైనా చేయాలనుకునే అభ్యుదయ వాదులు కానీ ...విప్లవకారులు కానీ  చేయవలసిన మొదటి పని ఈ అనైతిక బంధాన్ని తెగగొట్టడం.....అది చేయకుండా ముందుకు వెళ్తే మాత్రం పునాది లేకుండా భవనం నిర్మించడమే అవుతుంది.

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

మహా నాయకులారా సిద్దాంతాల రాద్దంతాలు తెలియని వాళ్ళం ...కానీ కాస్త కళ్ళున్నాయ్

                               చాలా గట్టిగా కేకలు వినబడుతున్నాయ్. అలమండ మీదుగా మా జీప్ వెళ్తుండగా రోడ్ కి అడ్డంగా జనం నిలబడి ఉన్నారు . పక్కగా ఉన్న చిన్న ఖాళీ స్థలంలో ఒక చిన్న స్టేజీ వేసి ఉంది. దాని మీద ఎవరో కొత్త వాళ్ళు ....ఇంకొక పక్కన ఈ మధ్యే జాతీయోద్యమంలో జైలు కి వెళ్లి వచ్చినట్లు ఫోజ్ పెట్టే "దొంగ రమణ " ఉన్నారు. కాకపొతే మా పని లోకే వచ్చి తన పని తను చేసుకుపోయే వెంకట్రావ్ మాత్రం వేదిక కు క్రింద నిలబడి గట్టిగా అరుస్తున్నాడు. అతడికి సపోర్ట్ గా ఇంకా రైతులు కూడా అరుస్తున్నారు. కాస్త ఆలస్యమైనా ఫరావాలేదనుకుంటూ క్రిందకు దిగి వేదిక వైపుగా నడిచాం . మమ్మల్ని ఎరిగున్న జనమే కాబట్టి మాకు దారి ఇచ్చారు. వెంకట్రావ్ దగ్గరకి వెళ్లి నెమ్మదిగా భుజం మీద చేయి వేసాను. వెనక్కి తిరిగాడు.
"సార్.....ఇలా వచ్చేరేంటి...?"
"నీవేమిటి .....ఇంత రెచ్చి పోతున్నావ్.... వేదిక మీద ఉన్న ఆ కొత్తాయన ఎవరు ?"
" ఆయనే సార్ ....ఎవరో .....ఏదో పార్టీ నాయకుడంట .....అసలాయన పార్టీనే జనం మరిచి పోతుంటే ఎప్పటి లాగానే పిచ్చి వాగుడు వాగుతున్నాడు . "
" ఛా... ఊరుకో ఎవరో పెద్దాయన లా ఉన్నాడు "
"పెద్దాయనే సార్ ....ఆ కళ్ళకున్న అద్దాలు తీయడు ......ఆ అద్దాలు ఎప్పుడో మసక బారి పొయ్యాయి. ఆయనకా విషయం అర్ధం కాక ఆ అద్దాల లోనుండి కనబడేదే లోకం అనుకుంటాడు . "
"సరేలే ఇంతకీ ఆయనేమంటాడు ......?"
"ఉప్పుడు ఈ రమణ గురించి ఈ వూర్లో ఇప్పుడే పుట్టిన బిడ్డనడిగినా చెప్పుద్ది. యీయనొచ్చి ఆడెంత ఎదవో చెప్పకుండా యీడు ఎప్పుడు కూడా ఏ గోడ మూలా ఒంటేలు పొయ్యడు కాబట్టి చాలా   గొప్పోడనట్లు చెబుతాడు. యీడు తాగి ఆడోళ్ళను బూతులు తిడతాడు .....దొరికిందల్లా అమ్మేసి తాగేత్తాడు....ఊరుమ్మడి చెరువులో చేపలు రాత్రి పూట పట్టి మర్నాడు పక్కూరి సంతలో అమ్మేత్తాడు....అసలు యీడు .ఈడి బాబూ కలసి చెయ్యని గోరమేదన్నా ఉందా ....... అయ్యన్నీ చెప్పకుండా ఈడు పోసే ఒంటేలు గురించి చెబుతాడేంటి సారూ .....మేమేమైనా ఈయన కళ్ళకి పిచ్చెదవల్లా అగపడతన్నామా.....?" వెంకట్రావ్ ఆవేశం తో ఊగి పోతున్నాడు

వెంకట్రావ్ ....ఆయన్నంటున్నాడా.......లేక వేరే పెద్ద పార్టీ వాళ్ళ నాయకుడిని ............



మరి కొంత మూలాలలోకి........


30, జనవరి 2014, గురువారం

సరి కొత్త "మోసగాళ్ళకు మోసగాడు "

                                "కనబడవు కానీ నీలో చాలా దుర్మార్గపు ఆలోచనలు చాలా ఉంటాయి " శ్రీమతి గట్టిగా వక్కాణించి మరీ చెప్పింది చాలా సార్లు . నిన్న నాలో కలిగిన ఆలోచనలు చూసి మొదటి సారిగా అది నిజమేమోనన్న సందేహం కలగడం ప్రారంభమయ్యింది . నిన్న(అనగా 29-1-14) ఉదయం ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ 7 వ పేజీలో పడిన వార్త చదవగానే సదరు "మద్దూరి వెంకటరమణా రెడ్డి " మీద కోపం రావలసింది పోయి "భలే .... భలే "అనిపించింది. పైకి చెబితే మా శ్రీమతి వెంటనే సైక్రియాటిస్ట్ అపాయింట్మెంట్ తీసేసుకుంటుందేమోనన్న భయం కూడా వేసింది . దయుంచి మీరుకూడా ఆ పేజీలో క్రింద సగంలో ఉన్న "శ్రీవారి సేవా టికెట్లు కావాలా ?.... నా అకౌంట్ లో డబ్బులేయండి " అన్న శీర్షికతో పడిన వార్త ఒక్క సారి చదివి ఎవరికైనా కూడా నాలో కలిగిన ఫీలింగ్స్ కలిగితే నాకు కాస్త తెలియజేయ ప్రార్ధన. లేదంటే నిజంగా నాలో ఏదో మానసిక లోపం ఉందేమోనన్న సందేహం పట్టి పీడిస్తుంది .

                           నిజంగా చెప్పాలంటే అ వార్తలో పెద్ద విశేషమేమీ లేదు . సదరు మద్దూరి వెంకట రమణా రెడ్డి తానొక ఉన్నతాధికారిగా నటించి జనంతో బాటు కొంత మంది స్వామీజీ లను కూడా  ఉదయాస్తమయ సేవలకు టికెట్స్ ఇప్పించ గలనని నమ్మించి డబ్బులు కొట్టేసాడు .  ఇక్కడ చిన్న విషయమేమిటంటే సామాన్య జనానికి కొన్ని భ్రమలు ఉండొచ్చు ..... కానీ స్వాములకు కూడానా ? వీళ్ళకు తామొక డొంక దారిలో వెళ్లి ఏదో ఒక సేవ కు టికెట్ సంపాదించడమంటే ఒక అర్హుడిని పక్కన పెడుతున్నామని కాని ..... అది పాపానికే దారి తీస్తుందన్న ఆలోచనే కలగదా ? బహుశా వీళ్ళ మనస్సులో ఉన్న ledger ప్రకారం సేవ వలన వచ్చిన పుణ్యం లో నుండి ఒక అర్హుడిని పక్కకు పెట్టిన పాపాన్ని తీసి వేస్తే  ఇంకా పుణ్యమే మిగిలి ఉంటుందన్న లెక్కలేమైనా ఉంటాయా ? అంటే ఇక్కడ కూడా కొన్ని వ్యాపార సూత్రాలు పాటించాలా ..... ? అప్పుడు కానీ మన అకౌంట్ లో పుణ్యం మిగలదా ? అసలు అన్నిటికన్నా పెద్ద సందేహమేమిటంటే ఇలాంటి డొంక/దొంగ  మార్గాల ద్వారా వచ్చి సేవలు చేసి .... దర్శనాలు చేసే వాళ్లకు పుణ్యం వచ్చేస్తే అది నిజంగానే భగవద్దర్సనమ్ అవుతుందా ?
....

అమ్మో నా ఆలోచనలను శ్రీమతి పసిగట్టేస్తే నేను తినే భోజనంలో మత్తు మందు కలిపేసి అంబులెన్స్ కు ఫోన్ చేసేయగలదు . ఇక ఆపేయడం మంచిది .


30, డిసెంబర్ 2013, సోమవారం

ఒక నగర వాసి జీవితంలో ఒక రోజు



సమయం
చేసిన పని
తన దృష్టిలో చేసిన పని తాలూకు ఫలితం
పుణ్యం వచ్చేవి
పాపం తెచ్చేవి
ఉ.06.30
రైతు బజార్ కు కూరగాయల కోసం బయలు దేరాడు. ఆ రోజు  గురు వారం అన్న సంగతి గుర్తుకు వచ్చి సాయి బాబా గుడి వైపుకి తిరిగాడు. అప్పటికే జనం వచ్చేశారు. పార్క్ చేసే స్థలం లేదు . ఫరావాలేదనుకుంటూ నాలుగు వాహనాలకడ్డంగా తన బండి పార్క్ చేసేశాడు. గుడి లో పెద్ద క్యూ ఉంది. ఎవరూ పట్టించుకోరనుకుంటూ లైన్ పట్టించుకోకుండా ముందుకు సాగి పొయ్యాడు. ఇద్దరు ముగ్గురు కేకలు వేసారు కానీ వినబడనట్లు వెళ్లి సాయిబాబా విగ్రహం ముందు సాష్టాంగ పడి పొయ్యాడు . బయటకు వచ్చేసరికి తన బండి అడ్డు రావడం వలన బయటకు తీయలేక నలుగురు వాహనదారులు ఎదురు చూస్తున్నారు.


ఏదో పుణ్యం ఇంతకు ముందు చేసాను కాబట్టే ఇంత సులభంగా దర్శనం దొరికింది.
ఎవరి ప్రాప్తం వారిది.....అందరి సంగతీ పట్టించుకుంటే మన పనులెలా ......?
ఉ.08.00

తెచ్చిన విభూతి తయారై కూర్చున్న పిల్లలిద్దరి ముఖాన రుద్దాడు . “ఏమిటి నాన్నా .....టైం చూడు ..ఇవాళ టెస్ట్ కూడా ఉంది “ అన్న కొడుకు తో  “ఫరవాలేదురా నేను తీసుకు వెళ్తానుగా” అంటూ రాంగ్ రూట్ లో ఇద్దరిని గుద్దినంత పని చేసి ఎలాగైనా కుమారుడిని టైం లో కాలేజ్ లో పడేసాడు.



ఈ సంవత్సరం ఒక్క సారీ మిస్ కాకుండా ప్రతి గురువారం సాయిబాబా గుడి కి వస్తానని మొక్కుకున్నాక ....మిగిలినివన్నీ స్వామే చూసుకుంటాడు.
రోడ్డన్నాక ఎవడికీ టచ్ కాకుండా డ్రైవ్ చేయకుండా ఉంటాడా...
?ఎప్పుడూ కరెక్ట్ రూట్ లోనే వెళ్తాడా ......
ఉ.08.30

రైల్వే స్టేషన్ కు బయలు  దేరాడు. రోడ్ కడ్డంగా వేసిన వినాయక చవితి పందిరి లో కెళ్ళి విగ్రహానికి నమస్కారం చేసి బయటకు వచ్చాడు .
తృప్తిగా ఫీలయ్యాడు ట్రాఫిక్ ఇబ్బంది కలిగించినప్పటికీ ...

ఉ.08.50

లోకల్ ట్రైన్ ప్లాట్ఫార్మ్ మీదకు వచ్చింది. పెద్ద రష్ లేదు కానీ దిగేవారిని తోసుకుంటూ లోపలికి దూరిపోయాడు. పక్క వాడి దగ్గర పేపర్ తీసుకుని చదవడం మొదలుపెట్టాడు . సహజం గానే ప్రయాణీకుల వాగ్యుద్ధం  ప్రారంభమయ్యింది. “అసలు ఈ పొలిటీషియన్స్ లో నిజాయితీ ఎక్కడుందండీ.....అందరినీ ఉరి తీసేయాలండీ ....
నక్సలైట్ లు మాత్రం కాంట్రాక్టర్ ల దగ్గర నుండి చందాలు దండుకోవడమే కదండీ .....” దిగవలసిన స్టేషన్ వచ్చే వరకూ వాగుతూనే ఉన్నాడు .

ఎన్నెన్ని కుంభకోణాలు .....2G....బొగ్గు...లేదంటే దేశం ఎక్కడో ఉండేది ......ఆ మాత్రం గట్టిగా చెప్పాలి ....

సా 5.00
....ట్రైన్ టైం అయి పోతోంది....ఈ రీ స్త్రక్చరింగ్ ఎప్పుడు అవుతుందో...హాపీ గా గవర్నమెంట్ జీప్ దొరికిపోతుంది .....పిల్లల ఆటో ఖర్చు కూడా సేవ్ అవుతుంది.
గవర్నమెంట్ జీప్ వాడని ఆఫీసర్ భూమ్మీద ఉంటాడా ...?
పాపం ఎంత మాత్రమూ కాదు
సా 7.00
“నాన్నా.....పరీక్షల టైం లో ఈ మైకుల గోల చాలా ఎక్కువగా ఉంది....నేను ..గౌతమ్ ...ఇంకా నలుగురం కలసి ఆ పందిరి లో వాళ్లకు సౌండ్ తగ్గించమని చెప్పొస్తాం...” అన్న కొడుకి మాటలకు ఉలిక్కి పడ్డాడు. “ఒరేయ్ ...ఈ ఏరియా అంతా వాళ్ళ వాళ్ళే .....నీవు బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుని చదువుకో.......”


మంచి ఇంజనీర్ అవ్వ వలసిన వాడిని అనవసర గొడవలలోకి ఎలా పంపిస్తాం.


రా 8.00
ఆటో ఆగింది . అమ్మాయి దిగింది . “అదేమిటమ్మా....
లేటయ్యి పోయింది .”నిర్భయ సంస్మరణార్ధం కాండిల్స్ టో ఊరేగింపు జరిపాం ....నాన్నా....పైగా పూర్తిగా ప్రెస్ కవరేజ్ ఉంది .పేస్ బుక్ లో ఉన్న  మా కాలేజ్ పేజ్ లో అన్ని ఫోటోస్ అప్ లోడ్ చేస్తారంట .
పిల్లలకు ఆ మాత్రం సోషల్ అవేర్నెస్ ఉండక పొతే ఎలా....